ADB: ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న కూరగాయల విత్తన కిట్లను రైతులు వినియోగించుకోవాలని HEO గణేష్ కోరారు. శుక్రవారం పూసాయి గ్రామంలోని చిన్న, సన్నకారు రైతులకు సుమారు రూ. 500 విలువైన టమాటా, బెండ, మిరప, ఆకుకూరల మినీ కిట్లను ఉచితంగా పంపిణీ చేశారు. రైతులు తమ ఇంటి అవసరాలకు సరిపడా కూరగాయలను స్వయంగా పండించుకోవాలన్నారు.