NZB: బోధన్ పట్టణంలోని 15వ వార్డు పరిధిలో హోలీ సందర్భంగా కుస్తీపోటీలు నిర్వహిస్తున్నట్లు వార్డు కౌన్సిలర్ అశోక్ రెడ్డి తెలిపారు. వచ్చే నెల 3వ తేదీన నిర్వహించే కుస్తీపోటీలకు బందోబస్తు నిర్వహించాలని పట్టణ సీఐ వెంకట నారాయణకు ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జెల్లా శంకర్, పడాల భీములు, గుమ్ముల శంకర్ రెడ్డి, పాల్గొన్నారు.