WGL: వరంగల్లో కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులపై రోగుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారనే విమర్శలు పెరుగుతున్నాయి. ఒకే రకమైన చికిత్సకు వేర్వేరు ఆస్పత్రుల్లో వేర్వేరు రకాలుగా ఫీజులు వసూలు చేస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. సాధారణ జ్వరం వంటి చిన్నపాటి అనారోగ్యానికి కూడా రూ.300 నుంచి రూ.500కు పైగా ఓపీ (అవుట్ పేషెంట్) ఫీజులు తీసుకుంటున్నట్లు సమాచారం.