MLG: ఏటూరునాగారం మండలం కోయగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని లంబాడితండా అంగన్వాడీ కేంద్రాన్ని సోమవారం సర్పంచ్ సరిత తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పిల్లలకు బాలామృతం, పౌష్టిక ఆహారం క్రమం తప్పకుండా అందించాలని అంగన్వాడి టీచర్ రాజ్యలక్ష్మికి సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, అంగన్వాడి సిబ్బంది తదితరులు ఉన్నారు.