SRD: జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీజీఐఐసీ, నిమ్జ్ భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అధికారులను ఆదేశించారు. జహీరాబాద్ నిమ్జ్ అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. టీజీఐఐసీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 1501 ఎకరాల భూమి సేకరణ జరిపి నిమ్జ్ అధికారులకు అప్పగించాలన్నారు.