NZB: నవీపేట్ మండల రైతులు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు యూరియా బుకింగ్ విధానంలోమార్పులు చేసినట్లు ఏఈఓ వినోద్ తెలిపారు. ఇకపై రైతులు ఇతర మండలాల్లోయూరియా బుక్ చేసే అవకాశం రద్దు చేసి,కేవలం తమ సొంత మండలంలోనే బుక్ చేసుకునేలా యాప్ను అప్డేట్ చేశారు. నేటి నుంచే ఈ విధానం అమలులోకి వస్తుందని, దీని వల్ల స్థానిక రైతులకు యూరియా లభ్యత సులువవుతుందని అధికారులు పేర్కొన్నారు.