NGKL: సలేశ్వరం జాతర సందర్భంగా భక్తుల రాకపోకలతో ఏర్పడిన ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను తొలగించేందుకు అటవీ శాఖ అధికారులు విస్తృత స్థాయిలో శుభ్రత చర్యలు చేపట్టారు. దాదాపు 170 మంది గిరిజన వాలంటీర్లను నియమించి అడవి ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమాన్ని క్రమబద్ధంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేక బృందాలుగా విభజించి చెత్త సేకరణ పనులను కొనసాగిస్తున్నారు.