MHBD: తొర్రూరు మండలంలోని చింతలపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో వ్యవసాయ కార్మిక గ్రామీణ పేదల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ. యాకుబ్ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు మానుకోవాలని, కూలీలు పనిచేస్తున్న ప్రదేశంలో సౌకర్యాలు కల్పించడం లేదని మండిపడ్డారు.