WNP: జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గురువారం పట్టణంలోని ప్రభుత్వ జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రధానంగా మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించిన ఆయన, విద్యార్థులకు వడ్డించే ముందు పర్యవేక్షకులు తప్పనిసరిగా ఆహారాన్ని రుచి చూడాలని ఆదేశించారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల మెరుగుదలకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.