SRCL: కరెంట్ బిల్లులు సకాలంలో చెల్లించి, సంస్థ అభివృద్ధికి సహకరించాలని సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ ఛైర్మన్ చిక్కాల రామారావు వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ, పరిశ్రమల రంగాలకు అడిగిన వెంటనే విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంలోనూ, అభివృద్ధిలో సహకార రంగానికి స్ఫూర్తిగా సెస్ నిలిచిందన్నారు. ఈ మేరకు వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఏప్రిల్ 4 సభను విజయవంతం చేయగలరని కోరారు.