WGL: నర్సంపేట నియోజకవర్గంలో లక్కీ డ్రాలు, గొలుసుకట్టు పేరుతో అక్రమ ఆర్థిక కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అనుమతి లేకుండానే కొందరు నిర్వాహకులు ఆకర్షణీయ ప్రకటనలతో ప్రజల నుంచి డబ్బులు సేకరిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు వస్తాయని ప్రజలను మోసగించి లాభం పొందుతున్నట్లు సమాచారం.