JGL: రాయికల్ పట్టణంలోని వాటర్ బెడ్ సమీపంలో రైతు మోసరపు సాయబుకు చెందిన ఆయిల్ పామ్ తోటకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటన చోటుచేసుకుంది. చేతికొచ్చిన పంట దశలో ఉన్న సుమారు 60 ఆయిల్ పామ్ చెట్లు అగ్నికి ఆహుతై భారీ నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆలస్యంగా చేరుకోవడంతో మంటలు మరింత వ్యాపించి నష్టం పెరిగిందని పేర్కొన్నారు.