ADB: ఇంద్రవెల్లి మార్కెట్ యార్డులో నేటి నుంచి పీఏసీఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మద్దతు ధరతో కందుల కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు పీఏసీఎస్ సీఈవో సునీల్ తెలిపారు. కావున రైతులు తమ కంది పంటను 12 శాతం మాయిశ్చర్ వచ్చే వరకు ఆరబెట్టి, చెత్త చెదారం, పుచ్చులు లేకుండా చేసి నాణ్యమైన సరుకును మార్కెట్ యార్డ్కు తీసుకురావాలని సూచించారు.