PDPL: రామగుండం గవర్నమెంట్ ఐటీఐలో నిర్వహించిన ఏటీసీ షార్ట్ టర్మ్ కోర్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్, మేయర్ మహంకాళి స్వామి హాజరయ్యారు. యువతకు నైపుణ్యాభివృద్ధి ఎంతో అవసరమని, ఇలాంటి కోర్సులు ఉపాధి అవకాశాలను పెంచుతాయని ఎమ్మెల్యే తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాలను వినియోగించుకోవాలన్నారు.