SRD: మండల కేంద్రమైన కంది రైతు వేదికలో నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు బుధవారం ప్రారంభమయ్యాయి. పంచాయతీ రాజ్ చట్టం 2018 , ఆదర్శ గ్రామం , ప్రభుత్వ పథకాలు, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు. గ్రామంలోని సమస్యలు పరిష్కరించేందుకు పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని మాస్టర్ ట్రైనర్ సూచించారు.