ADB: ఘోర ప్రమాదంలో జిల్లాకు చెందిన కిరణ్ సజీవ దహనం అయ్యాడు. స్థానికుల వివరాల మేరకు.. శ్రీ సత్యసాయి జి. పెనుకొండ మం. పులేకమ్మ గుడి వద్ద తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బంగాళదుంపల లారీని, గోధుమల లోడుతో వస్తున్న మరో లారీ బలంగా ఢీకొట్టడంతో మంటలు చెలరేగి గోధుమల లారీ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో కిరణ్ దహనమయ్యాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.