WGL: సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా నిర్వహిస్తున్న నాల్గవ రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో టేబుల్ టెన్నిస్ గెజిటెడ్ అధికారుల విభాగంలో WGL కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కాంస్య పతకం సాధించారు. అదేవిధంగా 55 ఏళ్ల గెజిటెడ్ అధికార బాల్ బ్యాడ్మింటన్ విభాగంలో వరంగల్ కమిషనరేట్కు చెందిన ఏసీపీలు జితేందర్ రెడ్డి, మధుసూదన్లకు బంగారు పతకం సాధించారు.