BDK: మణుగూరు మండలంలో ఇద్దరు వ్యక్తులు గల్లంతైన విషయం తెలిసిందే. కాగా పద్మగూడెంకు చెందిన పదిమంది మంగళవారం మల్లేపల్లి గోదావరి నది ఒడ్డుకు వచ్చారు. అక్కడే వంటలు చేసుకుని సరదాగా గోదావరి ఒడ్డున ఈత కొడుతుండగా ముగ్గురు ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగిపోతుండగా పద్దం ప్రసాద్ ఇద్దరిని కాపాడి, మరో వ్యక్తి నాగేశ్వరరావును కాపాడబోయి గల్లంతయ్యాడని తెలిపారు.