JN: పోలీస్ శాఖలో నియామకాలు, ప్రమోషన్లు, సిబ్బంది ఆరోగ్య భద్రత అంశాలపై జనగామ MLA డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో తీవ్రంగా నిలదీశారు. ఇవాళ అసెంబ్లీలో MLA మాట్లాడుతూ.. 17 లక్షల మంది అభ్యర్థులు రిక్రూట్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారని, గత ప్రభుత్వం 45 వేల నియామకాలు చేపట్టినట్లు గుర్తు చేశారు. వెంటనే కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు.