SRCL: బోయినిపల్లి మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా అధికారులు, సిబ్బంది హాజరు రిజిస్టర్, భూ భారతి రిజిస్ట్రేషన్ గది, కార్యాలయంలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. కార్యాలయానికి వచ్చే వారికి సేవలు అందించాలని సూచించారు. స్లాట్ బుక్ చేసుకున్న వారికి అందుబాటులో ఉండాలన్నారు.