NLG: చిట్యాలలో జాతీయ రహదారిపై జరుగుతున్న ఫ్లెఓవర్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయించాలని కోరుతూ బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతి పత్రం అందించారు. నల్గొండ పర్యటనకు వచ్చిన మంత్రిని చిట్యాల పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం కలిసి విన్నవించారు. పనులు నెమ్మదించడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.