JGL: కథలాపూర్ మండలంలోని అంబరిపేట గ్రామంలో నూతన అంగన్వాడీ కేంద్రం భవన నిర్మాణానికి ప్రజాప్రతినిధులు, అధికారులు భూమిపూజ చేశారు. ఈ భవనం కోసం ప్రభుత్వం రూ.12 లక్షలు మంజూరు చేసినట్లు అధికారులు వెల్లడించారు. నిర్మాణ పనులను నాణ్యతతో, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టరుకు సూచించారు. ఏ ఈ .జగదీశ్వర్, సర్పంచ్ వేముల లక్ష్మి, ఉప సర్పంచ్ సత్యం పాల్గొన్నారు.