RR: బీజేపీ, ఆర్ఎస్ఎస్లపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను చేవెళ్ల మున్సిపల్ BJP అధ్యక్షుడు అనంతరెడ్డి తీవ్రంగా ఖండించారు. చేవెళ్లలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు.