MBNR: పాలమూరు విశ్వవిద్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.20 కోట్లు కేటాయించడంపై వీసీ శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. గతంలో రూ.13 కోట్లు ఉండగా, ఈసారి అదనంగా రూ.7 కోట్లు పెంచడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ‘పీఎం ఉషా’ పథకం ద్వారా వచ్చిన రూ.100 కోట్లతో వర్సిటీలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.