ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇవాళ ఉదయం నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండ వేడికి సతమతమవుతున్న ప్రజలు ఈ చల్లదనంతో ఊపిరి పీల్చుకున్నారు. వాతావరణ శాఖ గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన విషయం తెలిసిందే. దీంతో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.