BHPL: చిట్యాల మండలం కేంద్రంలోని రామచంద్రాపూర్, కైలాపూర్ గ్రామ శివారులో సోమవారం జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఉద్యాన పంటలపై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునీల్ కుమార్ మాట్లాడారు. పంట మార్పిడి విధానంతో అధిక ఆదాయం సాధ్యమని తెలిపారు. డ్రిప్ సాగుతో నీటి పొదుపు, ఉత్పత్తి పెరుగుతుందని అన్నారు.