HYD: ఉప్పల్ స్టేడియంలో మెస్సీ మ్యాచ్ను ప్రత్యక్షంగా చూడాలని అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా DGP శివధర్ రెడ్డి కీలక వివరాలు వెల్లడించారు. మెస్సీ సాయంత్రం 7.15 గంటలకు ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటారని తెలిపారు. మ్యాచ్ మొత్తం 20 నిమిషాల పాటు జరుగుతుందని చెప్పారు. చివరి 5 నిమిషాల్లో CM, మెస్సీ కలిసి మ్యాచ్లో పాల్గొంటారని పేర్కొన్నారు.