HYD: ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన పురాతన ప్రతిష్టాత్మక స్వయం ప్రతిపత్తి ఉన్న కళాశాలలలో ఒకటైన నిజాం కాలేజ్లో నాయకత్వ మార్పు జరిగింది. భౌతిక శాస్త్ర విభాగానికి చెందిన ప్రొ. శ్రీనివాస్ నూతన ప్రిన్సిపల్గా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిలో కొనసాగిన ప్రొ. రాజశేఖర్ కాలేజీకి అంకితభావంతో సేవలు అందించారు.