SDPT: కోహెడ మండల పరిషత్ కార్యాలయంలో వార్డు సభ్యుల రెండో విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో కృష్ణయ్య కార్యక్రమాన్ని ప్రారంభించి, గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల అమలు, పంచాయతీ విధులు, నిధుల వినియోగంపై అవగాహన కల్పించారు. కూరెళ్ల, మైసంపల్లి, నకిరేకొమ్ముల తదితర గ్రామాల సభ్యులు హాజరయ్యారు.