HNK: రైలు నుంచి ప్రమాదవశాత్తు ఓ స్టేషన్ మాస్టర్ జారి పడి దుర్మరణం చెందిన ఘటన కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెకి చెందిన జనగాం మహేశ్ (45) ఉప్పల్ రైల్వేస్టేషన్ మాస్టర్గా పనిచేసేవారు. కాజీపేట వైపు వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైల్లో వెళ్తూ రైలు నుంచి జారీ పడి మృతి చెందారు.