JGL: రాయికల్, సారంగాపూర్ మండలాల్లో బస్సు సౌకర్యం కల్పించి సమయాల్లో మార్పులు చేయాలని సర్పంచులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల RTC DMను కలిసి వినతిపత్రం అందజేశారు. వడ్డెర కాలనీ, ధావన్పల్లి, వస్తాపూర్, ఇటిక్యాల ,మూటపల్లి, కిష్టంపేట, తాట్లవాయి, బోర్నపల్లి, బట్టపల్లి, పోతారం గ్రామాల్లో ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.