MBNR: హన్వాడ మండలం చిన్నదర్పల్లిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గోశాలలోని గోవులను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గోవులపై చిన్నతనం నుంచే తనకు అపారమైన ప్రేమ ఉందని, గోశాల అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ, గోశాల ప్రతినిధులు పాల్గొన్నారు.