NLG: పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రానికి చెందిన చేపూరి రంగమ్మ (62) అనే వృద్ధురాలు ఆదివారం వడదెబ్బతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. శనివారం నుంచి అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. గత వారం రోజులుగా ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వేసవిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.