నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తిలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి శనివారం పరిశీలించారు. పనుల నాణ్యతలో ఎటువంటి రాజీ పడకూడదని, విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను ఆయన ఆదేశించారు.