MBNR: మిడ్జిల్ మండలంలోని మసి గుండ్లపల్లి ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ‘స్వయం పరిపాలన’ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు, అధికారులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఎంఈవో సరస్వతి మాట్లాడుతూ.. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుత ప్రవర్తనను పెంపొందిస్తాయని అన్నారు.