KMM: సత్తుపల్లిలో వరద ఉదృతి నేపథ్యంలో కొత్తూరు గ్రామంలోకి వరద నీరు భారీగా చేరింది. దీంతో సత్తుపల్లి సీఐ శ్రీహరి గురువారం గ్రామాన్ని సందర్శించి 15 కుటుంబాలను రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సహాయంతో పునరావాస కేంద్రానికి సురక్షితంగా తరలించారు. వరద మరింత పెరిగే అవకాశం ఉన్నందున నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు సీఐ తెలిపారు.