NLR: తెలుగు భాష కేవలం సంభాషణ మాధ్యమం మాత్రమే కాదని, తెలుగు జాతి గర్వకారణం, ఆత్మీయత, భారతీయ సంస్కృతికి వెలుగునిచ్చే అద్దమని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇవాళ అన్నారు. తెలుగు మహా కవి, భాషా సంరక్షకుడు గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా ఏటా ఆగస్టు 29న తెలుగు భాష దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నట్లు చెప్పారు.