BHNG: యాదగిరిగుట్ట మండలం కాచారం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వెనుక నుంచి వచ్చిన ట్రాలీ ఆటో రెండు బైకులను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతుడు రాజాపేట మండలం బేగంపేటకు చెందిన నీలం నర్సింహులు(55)గా, గాయపడిన వ్యక్తి రాములుగా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.