KRNL: సీఎం చంద్రబాబును ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ జ్యోతి మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై ఆమె ముఖ్యమంత్రితో వివరంగా చర్చించారు. ఈ సందర్భంగా త్వరలో ప్రారంభించనున్న ‘ఇంటింటికి మీ వైకుంఠం జ్యోతి’ కార్యక్రమం పోస్టర్ను సీఎం చేతుల మీదుగా ఆవిష్కరించారు. ప్రజలతో మరింత దగ్గరయ్యే ఈ ప్రయత్నాన్ని ఆయన అభినందించారు.