BHPL: గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించేందుకు చేపట్టిన ఉపాధి హామీ పనులు చిట్యాల మండలంలో వేగం అందుకున్నాయి. వ్యవసాయ పనులు ముగింపు దశకు చేరడంతో రైతులు, కూలీలు ఉపాధి హామీ పనుల వైపు మళ్లుతున్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన పనులకు పెద్ద సంఖ్యలో కూలీలు హాజరవుతున్నారు. కైలాపూర్ శివారు రాయిచెరువులో కూలీలు ఉత్సాహంగా పనులు నిర్వహిస్తున్నారు.