SDPT: బెజ్జంకి మండలంలోని ఎల్లంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. గుబిరే రాజయ్య (65) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం మృతుని సోదరుడు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.