GDWL: జిల్లాలో నిరుద్యోగ యువతకు శిక్షణ, ఉపాధి కల్పించేందుకు జిల్లా ఉపాధి కల్పన శాఖ నేడు శుక్రవారం జాబ్ మేళా నిర్వహించనుంది. కలెక్టరేట్లోని ఎఫ్ 30/1లో ఉదయం 11 గంటలకు జరుగుతున్న ఈ కార్యక్రమానికి 18-35 సంవత్సరాల వయసు ఉన్న ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ చదివిన వారు హాజరు కావాల్సిందని జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.శ్రీ చరణ్ దీప్ వెల్లడించారు.