SRCL: బడిబాట కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి ప్రభుత్వ విద్యాసంస్థల్లో కనీసం 10 శాతం మేర విద్యార్థుల నమోదును పెంచాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి యోగితారాణా సూచించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లు, డీఈఓలతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల పెంపుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.