KNR: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రథమ సంవత్సర విద్యార్థులు ఉత్సాహంగా పరీక్షలకు హాజరయ్యారు. జిల్లాలోని 57 కేంద్రాల వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. సీసీ కెమెరా నిఘాలో పరీక్షలు కొనసాగనున్నాయి.