NZB: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద బోధన్ నియోజకవర్గానికి రూ.3.5 కోట్లు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే చొరవతో బోధన్, ఎడపల్లి, రెంజల్, నవీపేట్, సాలూర మండలాల్లో రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణానికి ఈ నిధులు కేటాయించారు. పనులను తక్షణమే ప్రారంభించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.