SRCL: సిరిసిల్లలోని కోర్టులో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలతో 14,820 కేసులను పరిష్కరించామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నీరజ తెలిపారు. సిరిసిల్లలోని కోర్టులో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 14,820 కేసులను పరిష్కరించి బాధితులకు రూ. 6,74, 41,119 నష్టపరిహారంగా ఇప్పించామన్నారు. రాజీ మార్గమే రాజ మార్గమన్నారు.