KMM: ములుగులోని హేమాచల శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి తన సతీమణి మాధురితో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించారు. అనంతరం గర్భాలయంలో నిర్వహించిన ప్రత్యేక అభిషేకాలు, అర్చనల్లో పాల్గొని స్వామివారి తీర్ధప్రసాదాలను స్వీకరించారు.