NGKL: ఊర్కొండ మండలం రాచలపల్లి గ్రామానికి చెందిన జెల్ల జంగమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. సోమవారం విషయం తెలుసుకున్న మధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి మృతుని కుటుంబ సభ్యుల పరామర్శించి కాంగ్రెస్ యువ నాయకుల ద్వారా రూ.5000 అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాడుగుల మహేష్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.