MLG: కన్నాయిగూడెం మండలంలో ఆస్పిరేషన్ బ్లాక్ సంపూర్ణ అభియాన్ 2.0 కార్యక్రమం అమలును పరిశీలించేందుకు నితి ఆయోగ్ కన్సల్టెంట్ శ్రీ కృష్ణన్ గోపాల్ పర్యటించారు. మండలంలోని పాఠశాలలు, ఆంగన్వాడీ కేంద్రాలు, విద్యార్థి వసతి గృహాలను సందర్శించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, పోషకాహారం, బోధన విధానం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.