JGL: ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి ఆదివారం మొత్తం రూ. 4,00,907 ఆదాయం లభించింది. టికెట్ల ద్వారా రూ. 2,12,109, ప్రసాదాల ద్వారా రూ. 1,44,940, అన్నదానం ద్వారా రూ. 43,858 వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండి ఆలయ ఆదాయం పెరిగిందని చెప్పారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఈవో శ్రీనివాస్ పేర్కొన్నారు.